ప్రస్తావనకు రాని అవిశ్వాస తీర్మానం నోటీసు, టిడిపి ఎమ్మెల్యేల ఆందోళన

తమ నోటీసును స్పీకర్ ప్రస్తావించకపోవడాన్ని తెలుగుదేశం శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ తప్పు పట్టారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయిందని ఆయన అన్నారు. ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిందనేది తేలిపోయిందని ఆయన అన్నారు. అధికారంలో కొనసాగే ఆర్హతను కోల్పోయిందని ఆయన అన్నారు. తమ నోటీసుపై ఏ విధంగా పోవాలనే విషయంపై మార్గాలను అన్వేషిస్తున్నామని ఆయన చెప్పారు. స్పీకర్పై పోరాటం చేయాలా, ప్రభుత్వంపై ఉద్యమించాలా, గవర్నర్పై ఒత్తిడి తేవాలా అనే విషయాలను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. నేటి ఎజెండా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక మాత్రమేనని స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పారు.












Click it and Unblock the Notifications