వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు భవిష్యత్తు భద్రమన్న ఆజాద్, స్థాయి రాలేదన్న చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad-Chiranjeevi
న్యూఢిల్లీ: కాంగ్రెసులో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి, ఆయన వర్గం భవిష్యత్తు భద్రంగా ఉందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ అన్నారు. ప్రజారాజ్యం పార్టీ నాయకులతో భేటీ అనంతరం సోమవారం సాయంత్రం ఆజాద్ చిరంజీవితో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడో విలీనమైపోయిందని ఆజాద్ అన్నారు. తన హైదరాబాదు పర్యటనలో చిరంజీవిని, ప్రజారాజ్యం పార్టీ నేతలను తాను ప్రత్యేకంగా కలుసుకోలేకపోయానని, అందుకే హైదరాబాద్ అహ్వానించానని ఆయన చెప్పారు. హైదరాబాద్ పర్యటనలో తాను అందరితో భేటీ అయ్యాయని, అందరి అభిప్రాయాలను సేకరించానని ఆయన అన్నారు.

కాంగ్రెసు అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చే స్థాయి తనకు ఇంకా రాలేదని చిరంజీవి అన్నారు. ఆజాద్‌తో ప్రజారాజ్యం నేతలు రెండు గ్రూపులుగా సమావేశమయ్యారని, ఒక్కసారి సీనియర్ నాయకులనూ మరోసారి శానసశభ్యులను ఆజాద్‌కు పరిచయం చేశానని ఆయన అన్నారు. కాంగ్రెసులో ప్రజారాజ్యం విలీనానికి సంబంధించి ఎన్నికల కమిషన్ నుంచి ప్రకటన రావాల్సి ఉందని, అందుకు పది పదిహేను రోజులు పట్టవచ్చునని ఆయన అన్నారు. విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత తమకు ఇచ్చే ప్రాముఖ్యం గురించి తెలుస్తుందని ఆయన అన్నారు.

English summary
Congress Andhrapradesh affairs incharge Gulam Nabi azad said that Chiranjeevi is safe in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X