హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దాశరథిని ఎన్టీ రామారావు అవమానించారు: తెలంగాణ మేధావి జయశంకర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణ మహాకవి దాశరథిని స్వర్గీయ ఎన్టీ రామారావు అవమానించారని, ఆ అవమాన భారంతోనే దాశరథి మరణించారని తెలంగాణ మేధావి ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. నమస్తే తెలంగాణ దినపత్రిక ఆవిష్కరణ సభలో ఆయన సోమవారం మాట్లాడారు. దాశరథికి జరిగిన అవమానంపై మీడియా మాట్లాడలేదని ఆయన అన్నారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై పెట్టిన విగ్రహాల విధ్వంసంపై గగ్గోలు పెట్టిన మీడియా దాశరథి గురించి ఎందుకు రాయలేదని ఆయన అడిగారు. దాశరథిని అస్థాన కవి పదవి నుంచి తొలగించి ఎన్టీ రామారావు అవమానించారని, తాము ఎంత చెప్పినా ఎన్టీ రామారావు వినలేదని ఆయన అన్నారు.

ట్యాంక్‌బండ్‌పై పెట్టిన విగ్రహాలను కూలుస్తామని మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ శానససభలో మాట్లాడితే మీడియా దాన్ని ప్రసారం చేయలేదని ఆయన అన్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారుల గుత్తాధిపత్యంలోని ప్రసార మాధ్యమాలు వాస్తలను మరుగున పడేయడమో, వక్రీకరించడమో చేస్తూ వస్తున్నాయని ఆయన విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కోస్తాంధ్రకు గోదావరి, కృష్ణానదుల నుంచి నీటి చుక్క రాదని మీడియా ప్రచారం చేస్తోందని, అయితే ఈ నదులు కాలు అడ్డం పెడితే ఆగేవి కావని, రాయలసీమ, కోస్తాంధ్రకు ఇవ్వాల్సిన వాటా ఇస్తూ తెలంగాణ న్యాయబద్దంగా దక్కాల్సిన వాటా అడుగుతున్నామని, ఈ విషయాన్ని తాము పదే పదే చెప్పినా మీడియా ప్రాధాన్యం ఇవ్వలేదని, కావాలనే ఇటువంటి చర్యకు మీడియా పూనుకున్నదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఓ పత్రిక రావాలనే కోరిక, అవసరం ఉందని, అది నేడు తీరుతున్నదని ఆయన అన్నారు.

English summary
Professor Jayashankar lashed out at Seemandhra media. He said that Telangana poet Dasarathi insulted by NT Rama rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X