తెలంగాణకు పరిష్కారం, సిఎంతో విభేదాలు లేవు: బొత్స సత్తిబాబు
మాజీ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ కాంగ్రెసు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంతో సేవ చేశారన్నారు. కార్యకర్తలు కష్టపడి పని చేయాలన్నారు. అధికారం ముఖ్యం కాదని ప్రజా సేవే ముఖ్యం అన్నారు. అధికారం లేకున్నా సేవ చేయవచ్చన్నారు. తనకు ముఖ్యమంత్రితో అభిప్రాయ బేధాలు లేవన్నారు. అందరం కలిసి ముందుకు వెళతామని స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజలలోకి తీసుకు వెళ్లాలని సూచించారు. పార్టీయే ప్రభుత్వానికి కళ్లు చెవులు అన్నారు. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అన్న అభిప్రాయం లేకుండా పని చేస్తాం అన్నారు. సీనియర్ల సూచనల మేరకు నడుచుకుంటామని చెప్పారు. త్వరలో ప్రజల వద్దకు వెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. తాను కోవర్టునే అని అయితే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా పని చేసే కోవర్టునని చెప్పారు.
Comments
botsa satyanarayana kiran kumar reddy congress telangana hyderabad బొత్స సత్యనారాయణ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు తెలంగాణ హైదరాబాద్
English summary
PCC President Botsa Satyanarayana hoped that Telangana issue will clear soon. He confirmed that he has no differences with CM Kiran Kumar Reddy.
Story first published: Saturday, June 11, 2011, 15:18 [IST]