బయటకు వెళ్లిపోండి: జగన్ వర్గం ఎమ్మెల్యేలకు సిఎం హెచ్చరిక

Kiran Kumar Reddy
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని విమర్శించే వారు పార్టీలో ఉండవలసిన అవసరం లేదని వారు బయటకు వెళ్లి పోవచ్చని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో వెళుతున్న కాంగ్రెసు ఎమ్మెల్యేలను ఉద్దేశించి హెచ్చరించారు. శనివారం బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెసులో ఉన్నత స్థాయిలో ఉన్న వారంతా ప్రతిపక్షాలను, మిగిలిన పార్టీలను ఎదుర్కొనే వారే అన్నారు.

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. పార్టీని 2014లో అధికారంలోకి తీసుకు రావడమే మా ఇరువురి ఆశయమే అన్నారు. సీనియర్ నేతలను గౌరవిస్తూ వారి సూచనల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. పార్టీ సమైక్యంగా ఉన్నప్పుడు ఎవరూ దెబ్బ తీయలేరన్నారు. గతంలో విభేదాల కారణంగానే నష్టపోయిందన్నారు. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. పార్టీలో కష్టపడే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. కార్యకర్తల వల్లే తమకు అధికారం వచ్చిందన్నారు. అలాంటి కార్యకర్తలను కాంగ్రెసు ఎప్పుడూ మరిచిపోదన్నారు. కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకు వెళ్లాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+