వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్ శివార్లలోని శ్మశానవాటికలో హుస్సేన్‌కు అంతిమ వీడ్కోలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

MF Hussain
లండన్/న్యూఢిల్లీ: ఎం.ఎఫ్. హుస్సేన్ అంత్యక్రియలు శుక్రవారం లండన్ శివార్లలోని బ్రూక్‌వుడ్ శ్మశానవాటికలో ముస్లిం మతాచారాల ప్రకారం జరిగాయి. హుస్సేన్ చివరి కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఆయన పార్థివదేహాన్ని బ్రూక్‌వుడ్ శ్మశానవాటికలో ఖననం చేశారు. అయితే హుస్సేన్ ఖననం కోసం తవ్విన గుంతకన్నా శవపేటిక బాగా పెద్దగా ఉండటంతో అంత్యక్రియలు గంట ఆలస్యంగా జరిగాయి.

ఈ అంత్యక్రియల్లో ఆయన నలుగురు కుమారులు షాఫద్, షంషాద్, ముస్తఫా, ఒవైస్‌లతోపాటు ఇద్దరు కుమార్తెలు అకీలా, రైసా పాల్గొన్నారు. బ్రిటన్‌లోని భారత రాయబారి నళిన్ సూరి, ప్రముఖ ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త లక్ష్మీ మిట్టల్, హిందూజా గ్రూప్ వైస్ చైర్మన్ జి.పి.హిందూజా, బ్రిటన్‌లోని భారతీయ విద్యా భవన్ చైర్మన్ జోగిందర్ సంగార్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు ప్రజల సందర్శనార్థం హుస్సేన్ పార్థివ శరీరాన్ని టూటింగ్‌లోని ఇదారే జఫేరియా వద్ద ఉంచి నమాజే జనాజా నిర్వహించారు. గత కొన్ని నెలలుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న 95 ఏళ్ల హుస్సేన్ గురువారం లండన్‌లోని రాయల్ బ్రాంప్టన్ ఆస్పత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

English summary
MF Hussain was on Friday buried according to Muslim religious rites at the Brookwood cemetery in Surrey, on the outskirts of London, as grieving family members and close friends prayed in silence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X