హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పక్కదారి పట్టాడు, వ్యతిరేకించే వారిపై చర్యలు తీసుకోండి: పొంగులేటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ponguleti Sudhakar Reddy
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు పార్టీ అభివద్ధికి పాల్పడుతూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కుటుంబం పట్ల విశ్వాసంగా ఉంటే ఆయన తనయుడు వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం పక్కదారి పట్టారని ఏఐసిసి సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి శనివారం బొత్స పిసిసి పగ్గాలు స్వీకరించిన కార్యక్రమంలో మాట్లాడుతూ విమర్శించారు. రాష్ట్రంలో మమ అనుకునే సంఘాలు పేరుగుతున్నాయన్నారు. పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బొత్స, ముఖ్యమంత్రి కిరణ్ కోవర్టుల పని పట్టాలని ఆయన సూచించారు. బొత్స సమయస్ఫూర్తి, చురుకుదనం, గట్టి నిర్ణయాలు తీసుకొని పార్టీని వ్యతిరేకించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

2014 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బొత్స, కిరణ్ పని చేస్తారని తాను భావిస్తున్నట్టు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇద్దరూ సమన్వయంతో పార్టీని ముందుకు నడిపించాలని కోరారు. మాజీ సారథి డి శ్రీనివాస్ సేవలు ఆమోఘం అన్నారు. ఆయన ఆధ్వర్యంలో పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందన్నారు. కాగా సోనియాను గౌరవించని వారు పార్టీలో నుండి బయటకు వెళ్లి పోవాలని ఏఐసిసి నేత కెబి కృష్ణమూర్తి సూచించారు.

పార్టీలో పుట్టి పార్టీని విమర్శించే వారిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ హెచ్చరించారు. ఈ సమావేశం నుండే పార్టీని విమర్శించే వారికి హెచ్చరికలు పంపుతున్నట్లు చెప్పారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమంగా కనిపిస్తోందన్నారు. కార్యకర్తల ఉత్సాహంగా ఉంటేనే పార్టీ మనుగడ చెందుతుందన్నారు.

English summary
AICC leader Ponguleti Sudhakar Reddy blamed YSR Congress party president YS Jaganmohan Reddy that he is going in wrong route.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X