వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుపిఎ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన బిజెపి నేత వెంకయ్యనాయుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Venkaiah Naidu
విశాఖపట్నం: యుపిఎ ప్రభుత్వంపై బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వానికి జబ్బులు చేశాయని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. అవినీతికి వ్యతిరేకంగా, నల్లధనం వెలికితీయాలనే డిమాండ్‌తో ఈ నెల 23 నుంచి 26వ తేదీవరకు దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 21వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

కాంగ్రెసుపార్టీది జాతీయవాదం కాదని, అవకాశవాదమని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఏ సమయంలోనైనా అత్యవసర పరిస్థితి రావచ్చునని ఆయన అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నా హజారే, బాబా రామ్‌దేవ్‌లకు తాము మద్దతు ఇవ్వడం రహస్యమేమీ కాదని ఆయన చెప్పారు. రైతు చైతన్యయాత్రలు, సదస్సులు ఆపి అన్నదాత సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని సూచించారు.

English summary
BJP senior leader M Venkaiah Naidu lashed out at UPA Government. He said that Congress is a oppatunist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X