హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై బొత్స సత్యనారాయణ వార్ మొదలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమరం ప్రారంభించినట్లే కనిపిస్తున్నారు. సోమవారం ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని పట్టిస్తున్నాయి. రైతు సమస్యలపై సకాలంలో స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు. పిసిసి అధికార ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వరి ధాన్యం సేకరణలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. రైతు సమస్యలను తీర్చే శక్తి మంత్రులకు ఉందని ఆయన అన్నారు.

ప్రతి దానికీ ముఖ్యమంత్రిపై ఆధారపడడం సరి కాదని ఆయన అన్నారు. స్వేచ్ఛగా వ్యవహరించాలని ఆయన ఈ వ్యాఖ్యతో సూచించినట్లు అర్థమవుతోంది. తాను సాయంత్రం మంత్రులతో సమావేశమవుతానని కూడా బొత్స సత్యనారాయణ చెప్పారు. శానససభ్యుల నియోజకవర్గాల్లో వారికి చెప్పకుండా నాయకులు పర్యటించకూడదని, ఇదే విషయం తాను మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు చెప్పానని ఆయన అన్నారు. మంత్రులతో మాట్లాడతానని అనడం ద్వారా కిరణ్ కుమార్ రెడ్డిపై ఆధిపత్యం సాధించాలనే ఉద్దేశంతోనే బొత్స సత్యనారాయణ ఉన్నట్లు భావించాల్సి ఉంటుందని అంటున్నారు.

English summary
It is clear that PCC president Botsa Satyanarayana has started his war against CM Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X