కాంగ్రెసుకు టిడిపి గతే పడుతుంది: వైయస్సార్ పార్టీ నేత రోజా

రైతులను పట్టించుకోనందుకు గతంలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు బుద్ది చెప్పారని ఇప్పుడు కాంగ్రెసుకు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రైతులను పట్టించుకోకుంటే టిడిపికి పట్టిన గతే కాంగ్రెసుకు పడుతుందన్నారు. అధికార పార్టీని రైతులు తరిమి తరమి కొడతారని హెచ్చరించారు. దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి తర్వాత రాష్ట్రంలో రైతులను పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చి జగన్ రైతాంగ సమస్యలను పరిష్కరిస్తారని అన్నారు. పక్క రాష్ట్రంలో రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తున్నారని కానీ రాష్ట్రంలో మాత్రం మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.












Click it and Unblock the Notifications