విద్యార్థుల ప్రాణాలతో టిఆర్ఎస్ బలం పెంచుకుంటోంది: కొండా సురేఖ
టిఆర్ఎస్ తెలంగాణలో ఉనికిని కోల్పోతుంది కాబట్టే పరోక్ష దాడులకు పాల్పడుతుందని అన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుండి తాను ఉద్యమానికి మద్దతు పలుకుతున్నానని చెప్పారు. తాను తన నియోజకవర్గంలో టిఆర్ఎస్ పైనే గెలుపొందినట్లు చెప్పారు. తనకు ప్రజల మద్దతు ఉందన్నారు. తాను ఎవరికీ భయపడేది లేదన్నారు. తెలంగాణ విషయంలో వెనుకడుగు వేసేది లేదన్నారు. తెలంగాణపై జగన్తో స్పష్టమైన వైఖరిని ప్రకటింపజేసిన తర్వాతనే ప్రజల్లోకి వెళతామని చెప్పారు. తనపై కాంగ్రెసు పార్టీ అనర్హత వేటు వేసినా కూడా తాను మళ్లీ తన నియోజకవర్గం నుండి గెలుస్తానని చెప్పారు.
Comments
konda surekha ys jagan telangana congress hyderabad కొండా సురేఖ వైయస్ జగన్ తెలంగాణ కాంగ్రెసు హైదరాబాద్
English summary
Parakal MLA Konda Surekha blamed Telangana Rastra Samithi for students suicide in Telangana. She confirmed that she will win in election if party will take action.
Story first published: Wednesday, June 15, 2011, 16:20 [IST]