గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను తన్నిన ఎద్దు, స్వల్పగాయాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nadendla Manohar
గుంటూరు: జిల్లాలోని తాడికొండలో ఏరువాక కార్యక్రమంలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను ఓ ఎద్దు తన్నడంతో స్వల్ప గాయాలయ్యాయి. స్వల్పగాయాలు అయిన నాదెండ్లకు వెంటనే స్థానికంగా చికిత్స చేయించారు. అనంతరం ఆయన ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం ఏరువాక కార్యక్రం జరుగుతుంది. దీనిని స్థానిక మంత్రి అయిన మాణిక్యవరప్రసాద్ ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం ఏరువాక కార్యక్రమం సందర్భంగా స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను మాణిక్య వరప్రసాద్ పిలిచారు.

కార్యక్రమానికి వచ్చిన నాదెండ్ల నడుస్తున్న సమయంలో దగ్గరలో ఉన్న ఎద్దు ఒకటి చుట్టూ భారీగా వచ్చిన జనాలను చూసి బెదిరిపోయింది. దీంతో అది పక్కనే ఉన్న నాదెండ్ల మనోహర్‌ను తన్నింది. దీంతో ఆయనకు స్వల్పగాయాలయ్యాయి. కాగా నాదెండ్లను ఎద్దు తన్నింది అని తెలియడంతో హైదరాబాదులోని ముఖ్యమంత్రి, స్పీకరు కార్యాలయం, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు నాదెండ్లకు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడిగారు. అయితే ఆయనకు ఏమీ కాలేదని స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయని ఎలాంటి ఆందోళన అవసరం లేదని మాణిక్యవరప్రసాద్ వారికి చెప్పారు.

English summary
An ox was attack on speaker Nadendla Manohar today in Eruvaka programme at Tadikonda of Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X