15 రోజులే గడువిస్తున్నాం: సోనియాగాంధీకి కెకె ఆల్టిమేటం

కాగా తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు గురువారం అధిష్టానానికి పెట్టిన డెడ్ లైన్ గురించి తనకు తెలియదని మంత్రి గీతారెడ్డి హైదరాబాదులో అన్నారు. తెలంగాణ విషయంపై టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులం అందరం ఐక్యంగానే ఉన్నామని చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కలిసే తీసుకుంటామని చెప్పారు. ఢిల్లీలో ఉన్న నేతలతో మాట్లాడి తాజా పరిణామాల గురించి చర్చిస్తానని అన్నారు. వరంగల్లో విద్యార్థులపై పోలీసుల చర్య హక్కుల ఉల్లంఘన అన్నారు. వారంలో తెలంగాణపై నిర్ణయం చెబుతామని అధిష్టానం హామీ ఇచ్చిందని చెప్పారు. కాగా తనకు పంటి నొప్పి ఉన్న కారణంగా ఢిల్లీ వెళ్లలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications