హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేబినెట్ సమావేశానికి ఏడుగురు మంత్రుల డుమ్మా, హాజరైన బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం ఏర్పాటు చేసిన మంత్రివర్గ సమావేశానికి ఏడుగురు మంత్రులు డుమ్మా కొట్టారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆరుగురు మంత్రులు, సీమాంధ్ర ప్రాంతం నుండి ఒక మంత్రి డుమ్మా కొట్టారు. టి-మంత్రులు తెలంగాణపై అధిష్టానం నుండి స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి బుధవారం న్యూఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే పది మంది మంత్రులు ఢిల్లీ వెళ్లినప్పటికీ నలుగురు మంత్రులు గురువారం ఉదయం తిరిగి వచ్చి సమావేశంలో పాల్గొన్నారు. శంకర్ రావు, డికె అరుణ తదితరులు తిరిగి వచ్చి సమావేశంలో పాల్గొన్నారు.

జానారెడ్డి, శ్రీధర్ బాబు, బస్వరాజు సారయ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సుదర్శన్ రెడ్డి తదితరులు తెలంగాణ కోసం అక్కడే ఉండిపోయారు. మంత్రివర్గ సమావేశంపై ఢిల్లీలో ఉన్న మంత్రులు స్పందిస్తూ తమకు తెలంగాణ ముఖ్యమని, మంత్రివర్గ సమావేశం ముఖ్యం కాదని వారు స్పష్టం చేశారు. ఇక సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ మానస సరోవరం యాత్రలో ఉన్నారు. దీంతో ఆయన కూడా హాజరు కాలేదు.

కాగా ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు జడ్జిమెంట్, ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పి కొట్టడం వంటి విషయాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడినందున ప్రత్యేక అధికారులను గ్రామ, మండల స్థాయిలో నియమించే విషయంపై కూడా చర్చించనున్నారు. కౌలు రైతుల రక్షణకు ప్రత్యేక చట్టం తేనున్నట్టు తెలుస్తోంది.

English summary
Seven minsters absent to today's cabinet meeting. Six ministers from Telangana, Kanna Laxminarayana from Seemandhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X