వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై పరిష్కరించకపోతే ఆమరణ దీక్ష: సోనియాకు టి-కాంగ్రెస్ లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై కేంద్రమంత్రులు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, అహ్మద్ పటేల్‌ల నుండి సరైన సంతృప్తికర సమాధానం రాక పోవటంతో ఈ విషయంపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకే నేరుగా లేఖ రాయాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెసు ప్రజాప్రతినిధులు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. గురువారం ఉదయం ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్లో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు భేటీ అయి ఏం చేయాలనే దానిపై చర్చించారు. ఈ లేఖలో కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కూడా సంతకం చేస్తారని తెలుస్తోంది. తెలంగాణకు తన సహకారం ఉంటుందని టి-నేతలకు ఆయన హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. శీతాకాల పార్లమెంటు సమావేశాలలో తెలంగాణ బిల్లు పెట్టాలని లేదంటే తాము రాజీనామాలకు కూడా సిద్ధమని సోనియాకు లేఖ ద్వారా తెలుపనున్నారని తెలుస్తోంది.

జూన్ నెలాఖరు వరకు అధిష్టానానికి డెడ్ లైన్ విధించి జూలై 1న రాజీనామాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 5వ తేది వరకు అధిష్టానం స్పందించకుంటే అప్పటి నుండి ఆమరణ నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా టి-కాంగ్రెసు అధిష్టానానికి డెడ్ లైన్ విధించినప్పటికీ ఐదు రాష్ట్రాల ఎన్నికల వరకు ఆగాలని సూచించింది. ఇప్పుడు వారు మరోసారి అధిష్టానానికి డెడ్ లైన్ విధించారు. అయితే వారు తమ లేఖను సోనియాతో పాటు కోర్ కమిటీలోని అందరు సభ్యులకు రాయాలని నిర్ణయించుకున్నారు. కాగా తమకు పదవులు కాంట్రాక్టు ఉద్యోగాల్లాంటివి అని శాశ్వతం కాదని మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. తెలంగాణ కోసం పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళతామని ఎంపీ రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఎలాంటి త్యాగానికై నా సిద్ధం అని చెప్పారు.

English summary
T-Congress leaders decided to write a letter to AICC president Sonia Gandhi on Telangana issue. They were met at MP Komatireddy Rajagopal Reddy's residence today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X