తెలంగాణపై చంద్రబాబు ఎలాగు నోరు తెరవడు: నాగం జనార్దన్

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు ఆ పార్టీ బహిష్కృత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి ఆదివారం ఆల్టిమేటం జారీ చేశారు. తెలంగా ఐక్య కార్యాచరణ సమితి పట్నం రోడ్లపై పొయ్యి కార్యక్రమంలో భాగంగా ఆయన గన్ పార్కు వద్ద తెలంగాణ ఉద్యోగ సంఘాల వంటావార్పులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టిడిపి తెలంగాణ ఫోరం నేతలు చంద్రబాబుతో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన ఇప్పించండి. లేదా ప్రజలలోకి రండి అని ఆల్టిమేటం జారీ చేశారు. చంద్రబాబుతో ఎలాగూ ప్రకటన ఇప్పించలేరు కాబట్టి ప్రజలలోకి రండి అన్నారు.

ప్రజల ఆగ్రహం చవి చూడక ముందే టిడిపి, కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే మంచిదని హెచ్చరించారు. లగడపాటి రాజగోపాల్ ఖబడ్దార్ అన్నారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. తెలంగాణను వ్యతిరేకిస్తే హైదరాబాదులో తిరగనివ్వమని హెచ్చరించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత నేతలు పార్టీలకతీతంగా ఏకం కావాలన్నారు. నాగంతో పాటు రెండు రోజుల క్రితం పార్టీనుండి బహిష్కరింపబడిన బోడ జనార్దన్ కూడా పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+