హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెట్రో ధరల పెంపుపై మండిపడిన చంద్రబాబు, పోరాటం చేస్తామని ప్రకటన

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: పెట్రో ధరల పెంపుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు యుపిఎ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. పెంచిన ధరలను తగ్గించే వరకు పోరాటం చేస్తామని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. సోమవారం తమ పార్టీ కార్యకర్తలు జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారని ఆయన చెప్పారు. పరిశ్రమలకు కోట్లాది రూపాయల రాయితీలు ఇస్తూ యుపిఎ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోందని ఆయన అన్నారు. ప్రజలను ఆదుకునే స్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేవని ఆయన అన్నారు.

ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు ముందు పెట్రో ధరల పెంపుపై మాట్లాడని ప్రభుత్వం ఎన్నికలు అయిపోగానే వడ్డింపులు ప్రారంభించందని, ఇది నీతిమాలిన చర్య అని ఆయన అన్నారు. దేశంలోని అవినీతిని కట్టడి చేయగలిగితే ధరలు పెంచాల్సిన అవసరం ఉండదని ఆయన అన్నారు. పెట్రో ధరల పెంపు వల్ల రాష్ట్ర ప్రజలపై 30 వేల కోట్ల రూపాయల భారం పడిందని ఆయన చెప్పారు. పెట్రో ఉత్పత్తులపై మన రాష్ట్రంలోనే అమ్మకం పన్ను తక్కువ అనే మాటలో నిజం లేదని ఆయన అన్నారు. నికర లాభాలున్నా పెట్రో ధరలు పెంచడం దారుణమని ఆయన అన్నారు. పెట్రో ధరలు మళ్లీ పెంచుతామని మంత్రి జైపాల్ రెడ్డి సంకేతాలు ఇవ్వడం దారుణమని ఆయన అన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు వల్ల అన్ని సరుకులు, వస్తువుల ధరలు పెరుగుతాయని ఆయన అన్నారు. రైతులను పట్టించుకునే స్థితిలో ప్రభుత్వం లేదని ఆయన అన్నారు.

English summary
TDP president N Chandrababu Naidu fired at UPA government for increasing petro prices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X