తెలంగాణ సెంటిమెంట్ ఇష్యూ, రాజకీయం వద్దు: బొత్స

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మృతి తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగుతాయో లేదో అనే అపోహలో ప్రజలు ఉన్నారని అలాంటివి ఏమీ పెట్టుకోవద్దన్నారు. కాంగ్రెసు పార్టీకి వ్యక్తులు ముఖ్యం కాదని విధానాలు ముఖ్యమన్నారు. సంక్షేమ పథకాలు తప్పకుండా కొనసాగుతాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో పావలా వడ్డీ, రూ.2 కిలో బియ్యం పథకం కూడా కొనసాగుతుందని చెప్పారు. కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు తలెత్తుకు తిరిగేలా పని చేస్తానన్నారు. కాగా లింగంపల్లి నుండి పటాన్ చెరుకు బొత్స బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కారణంగా ఆ ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. మంత్రులు బొత్స సత్యనారాయణను ప్రశంసల్లో ముంచెత్తారు.












Click it and Unblock the Notifications