Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రణబ్‌తో భేటీ‌: తెలంగాణ నేతలు అటు, లగడపాటి ఇటు

న్యూఢిల్లీ‌: కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులు కలిసి వెళ్లిన వెంటనే మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల వాదనలకు కౌంటర్ వినిపించడానికే లగడపాటి రాజగోపాల్ ప్రణబ్‌తో భేటీ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామాల నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత కూడా కాంగ్రెసు అధిష్టానం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నది. మంగళవారమంతా తెలంగాణ ప్రజాప్రతినిధులతో గులాం నబీ ఆజాద్, ఆహ్మద్ పటేల్ సమావేశం కాగా, రాత్రి ప్రణబ్ ముఖర్జీ సీన్‌లోకి వచ్చారు. అంతకు ముందు తెలంగాణ ప్రజాప్రతినిధులు ప్రణబ్ ముఖర్జీతో జరిగిన చర్చలు ఏ విధమైన ఫలితాలు ఇవ్వలేదని అర్థమవుతోంది.

కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు, మంత్రులు, శాసనసభ్యులు దిగి రావడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించడానికి నిర్దిష్టమైన గడువు ఇవ్వాలని తెలంగాణ నేతలు చెబుతున్నారు. మంగళవారం అర్థరాత్రి వరకు అధిష్టానం పెద్దలతో జరిగాయి. కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రులు కె. జానా రెడ్డి, సారయ్య, పొన్నాల లక్ష్మయ్య, శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు మంగళవారం రాత్రి సుదీర్ఘంగా చర్చించారు. రాత్రి 11 గంటలకు అహ్మద్ పటేల్‌తో జరగాల్సిన సమావేశం రద్దయింది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవసరం గురించి తాము ప్రణభ్‌కు చెప్పామని, పరిస్థితిని వివరించామని, తాను ఇతర అధిష్టానం పెద్దలతో పరిస్థితిని వివరిస్తామని ప్రణభ్ అన్నారని సమావేశానంతరం మంత్రి కె. జానా రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. ప్రణబ్ నుంచి వారికి ఆశాజనకమైన సమాచారం అందలేదని అర్థమవుతోంది. జానా రెడ్డి మాత్రమే రెండు మూడు మాటలు చెప్పేసి మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు. మిగతా నాయకులు కూడా మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఎప్పుడు సంప్రదింపులు ప్రారంభిస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారని తెలంగాణ నేతలు అధిష్టానం పెద్దలను అడుగుతున్నారు. దానికి వారికి అధిష్టానం పెద్దల నుంచి సరైన సమాధానం రావడం లేదు.

తెలంగాణ విషయంపై కాంగ్రెసు అధిష్టానం పక్కాగా యు- టర్న్ తీసుకున్నట్లే కనిపిస్తోంది. గులాం నబీ ఆజాద్ వంటి నేతలు చెబుతున్న విషయాలు ఆ విషయాన్నే తెలియజేస్తున్నాయి. సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది, ఏకాభిప్రాయ సాధన వంటి మాటల ద్వారా వ్యవహారాన్ని కాంగ్రెసు అధిష్టానం మళ్లీ మొదటికి తెచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+