రాజీనామాలపై వెనక్కి తగ్గితే రాళ్లతో కొట్టండి: దామోదర్

తెలంగాణ కోసం తాము ఏ త్యాగాలకైనా సిద్ధమని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే సరిహద్దుల్లో గోడలు కడుతామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ మంత్రులు రాజీనామాలు ఉపసంహరించుకుంటే ఇళ్లకే పరిమితం కావాల్సి ఉంటుందని, గ్రామాల్లో తిరగనివ్వబోమని ఆయన అన్నారు. కోటి మందితో హైదరాబాదును దిగ్భంధిస్తామని ఆయన అన్నారు. తెలంగాణ కోసం వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనూ పోరాడామని పార్లమెంటు సభ్యుడు కె. కేశవరావు అన్నారు. తెలంగాణ ఇవ్వండి లేదా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి పోరాటం చేయడానికి అనుమతి ఇవ్వాలని తాము పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఇస్తామని చెప్పి తెరాసతో 2004లో తెరాసతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వలేకపోయామని ఆయన అన్నారు. కాగా, దీక్ష చేస్తున్న శానసభ్యుడు చెరకు ముత్యంరెడ్డి స్పృహ తప్పి పడిపోయారు. దాంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు.












Click it and Unblock the Notifications