తెలంగాణ మంత్రులతో బొత్స చర్చలు విఫలం

కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాకుండా రాజీనామాలను ఎలా వెనక్కి తీసుకుంటామని మంత్రులు బొత్సను అడిగినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇస్తేనే తాము వెనక్కి తగ్గడానికి అవకాశం ఉంటుందని వారు తెగేసి చెప్పారు. కనీసం సంప్రదింపులు జరుపుతామనే హామీ కూడా తమకు రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ విధమైన హామీ రాకుండా రాజీనామాలను ఉపసంహరించుకుంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని, అందుకు తాము సిద్ధంగా లేమని వారు చెప్పారు.
పార్టీ అధిష్టానంతో తెలంగాణపై చర్చలు జరపాలని, తమ మనోభావాలను కేంద్రానికి తెలియజేయాలని మంత్రులు బొత్స సత్యనారాయణకు సూచించినట్లు చెబుతున్నారు. తెలంగాణపై త్వరలో ఓ ప్రకటన వస్తుందని బొత్స సత్యనారాయణ వారికి చెప్పినట్లు సమాచారం. వారంలోగా కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ పార్టీ అధిష్టానం నుంచి గానీ ప్రకటన రావచ్చునని ఆయన మంత్రులతో చెప్పారని అంటున్నారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications