మూడేళ్ల పాటు భార్య రక్తాన్ని భర్త తాగాడు
సుమారు ఏడు నెలల క్రిందట ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. భర్త చేస్తున్న పైశాచిక చర్యకు తన నిరసన తెలిపింది. వ్యతిరేకించినందుకు ఆమెను కొట్టి హింసించేవాడు. చివరకు ఒక రోజు తన బిడ్డను తీసుకొని పటేరా పోలీస్ స్టేషన్ పరిధిలో వున్న తన తల్లి దండ్రుల ఇంటికి పారిపోయింది. తండ్రి ఒక రైతు. అతనికి తన కధ మొత్తం వివరించింది. వీరిద్దరూ కలసి పోలీస్ స్టేషన్లో జరిగింది వివరించడంతో పోలీసులు అంతా విన్నారు. అయితే, మహేశ్ వున్న ఏరియా హిందోరియా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని ఈ ఫిర్యాదు అక్కడ ఇవ్వాలని వారు తెలిపారు.
హిందోరియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అక్కడి మహిళా కౌన్సెలింగ్ విభాగానికి తెలియపరచాల్సిందిగా వారు కోరారు. చివరకు పరారీలో వున్న నిందితుడు మహేశ్ పై అటు పటేరియా పోలీస్ స్టేషన్ లేదా ఇటు హిందోరియా పోలీసులుగాని కేసు నమోదు చేయలేదు. అయితే, విషయం తెలుసుకొన్న షికార్పుర గ్రామస్తులు దీప పరిస్ధితిని అర్ధం చేసుకుని తామే పోలీస్ స్టేషన్కు వెళ్లి గట్టిపట్టు పట్టడంతో, గత్యంతరంలేని హిందోరియా పోలీసులు ఇపుడు మహేశ్ ఆమెను శారీరకంగా హింసించాడంటూ కేసు నమోదు చేసుకున్నారు.