కాంగ్రెసులో తెలంగాణ, సీమాంధ్ర నేతల వార్

కాగా, సమైక్యరాగం వినిపించడానికి ఢిల్లీ చేరిన సీమాంధ్ర నేతలు తమ వాణిని పెంచారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో సోమవారం కావూరి సాంబశివరావు నివాసంలో సమావేశమైన సీమాంధ్ర నేతలు రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తే మరిన్ని ముక్కలు చేయాల్సి వస్తుందని వారంటున్నారు. దేశవ్యాప్తంగా ఇది సమస్యను సృష్టిస్తోందని వారంటున్నారు. నిజానికి, పార్టీ ఏకాభిప్రాయ సాధనకు కాంగ్రెసు అధిష్టానం నడుం బిగించింది. అయితే, ఇరు ప్రాంతాల నాయకుల మధ్య చర్చలకు ప్రాతిపదిక కూడా లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రం తప్ప మరోటి కూడదని తెలంగాణ నాయకులు, సమైక్యం తప్ప మరోటి కూడదని సీమాంధ్ర నేతలు అంటున్నారు. ఈ విషయంలో ఏ మాత్రం పట్టువిడుపులు ప్రదర్శించడం లేదు. ఈ స్థితిలో కాంగ్రెసు అధిష్టానానికి సమస్య పరిష్కారం కత్తి మీద సాములా తయారైంది.












Click it and Unblock the Notifications