ఆజాద్కు షాక్: టి - నేతల ధిక్కారం, ఢిల్లీకి డుమ్మా

తెలంగాణ అంశంపై సీమాంధ్రులు గందరగోళాన్ని సృష్టించే పని చేస్తున్నారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ అన్నారు. సీమాంధ్ర ప్రాంతం నుండి ముఖ్యమంత్రులుగా చేసిన చాలామంది పార్టీ అధిష్టానానికి వెన్నుపోటు పొడిచిన వారే అని అన్నారు. ప్రతి సమస్య చర్చల ద్వారా పరిష్కారం అవుతుందన్నారు. అధిష్టానం చర్చలకు పిలిచినప్పుడు వెళ్లవలసి ఉంటుంద్నారు. మా విధానం బలహీనపడే అవకాశం లేదన్నారు. చైనాలో ఆజాద్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆజాద్ కన్నా పెద్దస్థాయి నేత చర్చలలో పాల్గొంటే తాము ఆజాద్తో చర్చించేందుకు సిద్ధమని అన్నారు. అధిష్టానం తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తుందనే అభిప్రాయాన్ని మరో ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications