విజయనగర సామ్రాజ్యం నిధినిక్షేపాల కోసం వేట

విజయనగర పాలకులు నిర్మించిన బుక్కపట్నం శివాలయంలోని దేవతా విగ్రహాన్ని ధ్వంసం చేసిన నలుగురు సభ్యులతో ముఠాను పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. విజయనగర చక్రవర్తులకు పెనుకొండ వేసవి కాలంలో రాజధానిగా ఉండేది. దాంతో అక్కడ పెద్ద యెత్తున నిధినిక్షేపాలు ఉండవచ్చునని ఊహించి వాటి కోసం ముఠాలు వేట సాగిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పెనుకొండ, గుత్తి, రత్నగిరి, మడకశిర మండలాల్లోని పర్వత ప్రాంతాల్లో విజయనగర పాలకులు కోటలను, భారీ కట్టడాలను నిర్మించారు. వాటిని తవ్వే పనిలో మఠాలు పడ్డాయి.
ముస్లిం పాలకుల నుంచి కాపాడడానికి కర్ణాటకలోని తమ రాజధాని హంపీ నుంచి పెద్ద యెత్తున బంగారు ఆభరణాలను విజయనగర చక్రవర్తులు అనంతపురం జిల్లాలోని పెనుకొండకు ఏనుగులు, గుర్రాలు, ఎడ్ల బండ్లపై తరలించారని చెబుతారు. పెద్ద యెత్తున సంపదను కోటల్లో, గుడుల్లో, స్మారక కట్టడాల్లో దాచి పెట్టారని అంటారు.












Click it and Unblock the Notifications