అధిష్టానానికి లగడపాటి 'వైయస్ జగన్ క్లిప్పింగ్స్'

లగడపాటి అనుచరులు సైతం రాజకీయ భవిష్యత్తు బాగా ఉంటుందని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. లగడపాటి, జగన్పై తీవ్ర విమర్శలు చేయడంతో కోస్తా కాంగ్రెసులో కొత్త సమీకరణాలు సైతం వస్తాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సిఫార్సుతో కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కించుకున్న సాయి ప్రతాప్, జగన్ విషయంలో స్పందించడం లేదన్న కారణంతోనే ఆయనకు ఉద్వాసన పలికినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకు లగడపాటి తన పంథా మార్చారని పలువురి భావన.












Click it and Unblock the Notifications