సీమాంధ్ర నేతల వాదనకు తెలంగాణ వివేక్ కౌంటర్

పార్టీ అధిష్టానం తెలంగాణ ఇవ్వాలా వద్దా అని చర్చలు జరిపితే తాము వెళ్లే ప్రసక్తి లేదని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రులకు వచ్చే నష్టమేమీ లేదన్నారు. కేంద్రంతో చర్చలకు అభ్యంతరం లేదని అయితే తెలంగాణ ఇస్తామని చెబితేనే చర్చలకు వెళతామని అన్నారు. సంప్రదింపుల కమిటీ ఏర్పాటు చేస్తే మా అభిప్రాయాలు చెబుతామని అన్నారు. సీమాంధ్రుల అభ్యంతరాలను నివృత్తి చేస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమం చివర దశకు వచ్చిందన్నారు. ఈ నెల 21న ఢిల్లీ వెళ్లే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా మంత్రి జానారెడ్డి ఇంట్లో ఎమ్మెల్యేలు, మంత్రులు భేటీ అయి ఢిల్లీ పర్యటనపై చర్చిస్తున్నారు.












Click it and Unblock the Notifications