ఎస్మాకు రంగం సిద్ధం, సై అన్న ఉద్యోగులు!
విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ప్రత్యేక భద్రత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అత్యవసర సేవలకు అంతరాయం కలగకూడదని ముఖ్యమంత్రి వారిని ఆదేశించారు. ఈ సమీక్షలో వైద్య, విద్య, రవాణా శాఖకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. కాగా ప్రభుత్వ ఎస్మా ప్రయోగంపై ఉద్యోగ సంఘాల జెఏసి నేత స్వామిగౌడ్ స్పందించారు. ఎస్మా ప్రయోగించాల్సిన సమయం వస్తే ఉద్యోగులకు ఇచ్చిన మాట తప్పిన మంత్రులపై, ప్రభుత్వంపై ప్రయోగించాలని డిమాండ్ చేశారు. తాము సకల జన సమ్మెకు పూనుకుంటున్నామని తాము వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
ఎంపీ పొన్నం ప్రభాకర్ సైతం కరీంనగర్లో మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల సమ్మెకు మద్దతు పలుకుతామని చెప్పారు. ఎస్మా ప్రయోగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రిటైర్డ్ ఉద్యోగులు విధుల్లో పాల్గొనకుండా చూస్తామని చెప్పారు. పార్లమెంటు ముందు ప్రాణత్యాగం చేసినా సీమాంధ్ర కళ్లు తెరుచుకోవడం లేదా అని ప్రశ్నించారు. వారికి ఇంకా ఎన్ని తెలంగాణ ప్రాణాలు కావాలని ప్రశ్నించారు.