తెలంగాణ పరిష్కారమవుతుంది కానీ..: కావూరి

రాష్ట్రం విడిపోవడం అసంభవమని, ఆ విషయంలో జరుగుతున్నదంతా కొందరి దుష్ప్రచారమని ఆయన కొట్టిపారేశారు. రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాలను అధిష్టానానికి వివరించామని అన్నారు. ప్రధాని భేటీలో ఇది ఒక రాష్ట్ర సమస్య కాదని దేశం ముక్కలయ్యే ప్రమాదం ఉందని సూచించినట్లు చెప్పారు. విభజనపై ఆవేశాలకు లోనుకాకుండా మూడు ప్రాంతాల వారు బృందాలుగా ఏర్పడి ఉమ్మడి వేదికపై చర్చించాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సూచించారని చెప్పారు.












Click it and Unblock the Notifications