వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ ఖరీదైన భవనాలపై సిబిఐ కన్ను!

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన ఆస్తుల దర్యాఫ్తు విషయంలో శుక్రవారం ఏపిఐఐసి మాజీ చైర్మన్ బిపి ఆచార్య సిబిఐ అధికారుల ముందు తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులపై సిబిఐకి ఇప్పటి వరకు పదహారు కంపెనీలు వివరాలు సమర్పించాయి. మరో నాలుగు కంపెనీలు శుక్ర, శనివారాల్లో పెట్టుబడులు, ఆర్థిక వ్యవహారాలపై వివరాలు సమర్పించే అవకాశం ఉంది. పెట్టుబడిదారులు పొందిన భూ కేటాయింపులు, అనుమతులు, రాయితీలను సిబిఐ అధ్యయనం చేస్తుంది.

రెవెన్యూ, ఐటి, పరిశ్రమలు, గనుల శాఖల నుండి సిబీఐ రికార్టులు తెప్పిస్తోంది. జగన్ ఖరీదైన భవనాల నిర్మాణ వ్యయంపైనా సిబిఐ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా జగన్ కంపెనీలు అయిన జగతి, ఇందిరా టెలివిజన్, భారతి కంపెనీలలోకి భారీగా పెట్టుబడులు రావడంతో సిబిఐ అధికారులు వాటిలోకి వచ్చిన పెట్టుబడులపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఐదో రోజు సిబిఐ అధికారుల దర్యాఫ్తు కొనసాగుతోంది. అయితే తవ్విన కొద్ది కొత్త కొత్త విషయాలు బయట పడుతున్నట్లుగా తెలుస్తోంది.

English summary
It seems, CBI officers are concentrating on YSR Congress party president YS Jaganmohan Reddy's costly buildings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X