ఎన్టీఆర్ తర్వాత నేనే: ముఖ్యమంత్రి సంబూరం

కాగా, తెలంగాణ ఉద్యోగులు సమ్మెకు దిగితే ఎస్మా ప్రయోగించాలని ప్రభుత్వం అనుకుంటోందని మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన అంతకు ముందు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్మా ప్రయోగిస్తారని మీకు ఎవరు చెప్పారు, మీరే అంటారు, మీరే రాసుకుంటారా అని ఆయన అన్నారు. తెలంగాణ మంత్రుల రాజీనామాల వల్ల పాలన కాస్తా స్తంభించిన మాట నిజమేనని ఆయన అన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజ్యాంగం హక్కు కల్పించిందని ఆయన అన్నారు. జగన్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ప్రాథమిక దర్యాప్తు సాగుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications