హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఆస్తులపై మరింత దర్యాప్తునకు సిబిఐ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల వ్యవహారంపై అసలు విషయాలు తేలాలంటే మరింత లోతుగా దర్యాప్తు జరగాల్సిందేనని సిబిఐ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలపాలన్న ఆలోచనలో సిబిఐ అధికారులున్నారు. రెండు వారాల పాటు జరిగిన విచారణలో అక్రమాలు జరిగాయన్న దానికి ప్రాథమిక ఆధారాలు సేకరించినట్లు, పూర్తి వివరాలు రాబట్టాలంటే మరింతగా దర్యాప్తు అవసరమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి హైకోర్టులో ప్రారంభయ్యే విచారణపై కేసు భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ సీబీఐ అభిప్రాయం మేరకు సమగ్ర దర్యాప్తునకు న్యాయస్థానం అనుమతించిన పక్షంలో కేసు మరో సంచలనానికి కేంద్రం కానుంది. అవసరమైతే సీబీఐ కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేసే అవకాశమూ ఉందని అంటున్నారు.

ప్రాథమిక దర్యాప్తు నివేదికను సమర్పించడానికి రెండు వారాల గడువు మాత్రమే ఇవ్వడంతో సీబీఐ అధికారులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి సమయంలో జగన్‌కు సంబంధించిన అన్ని కంపెనీలను విచారించడం సాధ్యం కాదు కాబట్టి జగతి పబ్లికేషన్స్‌, ఇందిరా టెలివిజన్‌, భారతి సిమెంట్స్‌లలో పెట్టుబడులు పెట్టిన సంస్థలపై ఆరా తీస్తున్నారు. ఆయా సంస్థలకు ప్రభుత్వం నుంచి అందిన ప్రతిఫలాలపై దృష్టిసారిస్తున్నారు. వాటి పెట్టుబడులకు, ప్రభుత్వం నుంచి పొందిన రాయితీలకు మధ్య సంబంధం ఏదైనా ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. లాభాలపై స్పష్టత లేకున్నా, రూ.వందల కోట్లు పెట్టుబడులు పెట్టిన సంస్థలపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని సీబీఐ అభిప్రాయపడుతోంది.

హైకోర్టుకు నివేదిక సమర్పించేందుకు గడువు దగ్గరపడుతుండటంతో సీబీఐ విచారణ ముమ్మరం చేసింది. ఆదివారం కూడా దర్యాప్తు అధికారులు విధులకు హాజరయ్యారు. రోజూ రాత్రి ఒంటిగంట వరకూ కార్యాలయంలోనే ఉంటున్నారు. ఇప్పటి వరకు పలు కంపెనీల ప్రతినిధులను పిలిచి మాట్లాడిన అధికారులు ప్రస్తుతం దస్త్రాలను విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు 24 కంపెనీలకు వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా, వాటిలో 22 హాజరయ్యాయి. మిగిలినరెండు కంపెనీలు సోమవారం నాటికి తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది. మంగళవారం హైకోర్టుకు నివేదికను అందజేసే అవకాశముంది.

English summary
It is said that CBI may appeal to High Court for more time to probe on YSR Congress party president YS Jagan's properties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X