డోన్ అసెంబ్లీ సీటు అభ్యర్థిని ప్రకటించిన జగన్

YS Jagan
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం తన ఓదార్పు యాత్రలో సంచలన ప్రకటన చేశారు. ఆయన గత కొద్ది రోజులుగా కర్నూలు జిల్లాలో ఓదార్పు యాత్ర చేస్తున్నారు. ఈ ఓదార్పు యాత్రలో ఆయన డోన్ శానససభా నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. ఈ సీటు నుంచి రాజేంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తారని ఆయన చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబాన్ని ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడానికే ఆయన డోన్ అభ్యర్థిని ప్రకటించినట్లు భావిస్తున్నారు.

డోన్ నియోజకవర్గంలో ఓదార్పు యాత్రకు వైయస్ జగన్‌కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. డోన్ నియోజకవర్గం నుంచి కోట్ల విజయభాస్కర రెడ్డి కోడలు, కర్నూలు పార్లమెంటు సభ్యుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి భార్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డోన్‌లో వైయస్సార్ విగ్రహ ప్రతిష్టాపనను అధికారులు అడ్డుకున్నారు. విగ్రహ ప్రతిష్టాపనకు అనుమతి లేదని అందుకు వారు నిరాకరించారు. దీంతో ఆగ్రహించి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి సవాల్ విసిరే ఉద్దేశంతో డోన్ నియోజకవర్గానికి జగన్ అభ్యర్థిని ప్రకటించినట్లు భావిస్తున్నారు. బేతంచర్లకు చెందిన రాజేంద్రనాథ్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండేవారు.

తాము అధికారంలోకి వస్తే రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తోందని ఆయన విమర్శించారు. తననూ తన తల్లినీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరించామని ఆయన అన్నారు. త్వరలో వైయస్సార్ స్వర్ణయుగం వస్తుందని ఆయన అన్నారు. మహిళలకు, రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+