కించపరిస్తే వైయస్ జగన్ను సహించం: దానం
ప్రతి సమావేశంలోనూ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకే తాము ప్రాధాన్యం ఇచ్చామని, వాస్తవాలు మరచి అనవసర విమర్శలు మానుకోవాలని మంత్రి హితవు పలికారు. ఎస్సై రాత పరీక్షలోగా 14ఎఫ్ తొలగిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 14ఎఫ్ తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. అత్యవసర సేవలుగా ప్రకటించిన శాఖల్లో ఉద్యోగులు సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగం తప్పదని ఆయన అన్నారు. ప్రత్యేకమైన ఎజెండాతో ఉద్యోగులు చర్చలకు వస్తారని ఆయన అన్నారు.
సబ్ కమిటీకి ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారనే విమర్శను ఆయన ఖండించారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించే ఈ సబ్ కమిటీకి ఎవరూ నాయకత్వం వహించడం లేదని ఆయన అన్నారు. రాజీనామాలు చేయని తెలంగాణ ప్రజాప్రతినిధులు పాండవులని ఆయన అన్నారు. దానం నాగేందర్ ప్రకటనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణకు చెందిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. త్వరలోనే దానం నాగేందర్ తెలంగాణవాదిగా మారుతారని ఆయన అన్నారు.