హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కువైట్‌లో ముగ్గురు తెలుగువారి కాల్చివేత

By Pratap
|
Google Oneindia TeluguNews

Kuwait Map
హైదరాబాద్: కువైట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురిని ఓ పోలీసు అధికారి కాల్చి చంపాడు. రంజాన్ ఉపవాసాల తొలి రోజు గత సోమవారం ఓ అధికారి కువైట్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు జరిపి నలుగురిని కాల్చి చంపాడు. ఈ సంఘటనలో నలుగురు భారతీయులు మరణించినట్లు భారత దౌత్య కార్యాలయం శుక్రవారం ధ్రువీకరించింది. వీరిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు వారిని నల్లగుట్ట రమణయ్య, తోకల నరేష్ కుమార్, మసగిరి ఓబుల్ రెడ్డిలుగా గుర్తించారు. మరో భారతీయుడిని రామ్‌బీమ్‌గా గుర్తించారు.

దుర్మార్గానికి పాల్పడిన అంతర్గత వ్యవహారాల శాఖ అధికారి హైటమ్ అల్ - హజేరిని అరెస్టు చేశారు. అతని మానసిక స్థితి బాగా లేదని అంటున్నారు. మృతుల్లో నరేష్ కుమార్ కడప జిల్లాలోని నాగువారివాండ్లపల్లె గ్రామానికి చెందినవాడు. రామణయ్య చిత్తూరు జిల్లా అగ్గివారిపల్లెకు చెందినవాడు. నరేష్ రెండేళ్ల క్రితం కువైట్ వెళ్లాడు. అతనికి భార్య నాగలక్ష్మి, ఒకటిన్నరేళ్ల కుమారుడు ఉన్నారు. రమణయ్య ఉద్యోగం కోసం ఏడాది క్రితం కువైట్ వెళ్లాడు. అతని భార్య నాగేశ్వరమ్మ కువైట్‌లో కూలీగా పనిచేస్తోంది. వారికి ముగ్గురు పిల్లలు. ఇఫ్తార్‌కు రెండు నిమిషాల ముందు భోజనాలు చేసినందుకు నరేష్, ఓబుల్ రెడ్డిలను కాల్చి చంపినట్లు చెబుతున్నారు.

English summary
Three workers from Andhra Pradesh and another Indian were killed when a police officer went on a shooting spree in three different locations in Kuwait on the first day of Ramzan on last Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X