వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోశయ్యను టార్గెట్ చేసిన టి - కాంగ్రెసు నేతలు

By Pratap
|
Google Oneindia TeluguNews

R Damodar Reddy
హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై కాంగ్రెసు తెలంగాణ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్యను లక్ష్యం చేసుకున్నారు. రోశయ్యపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగా శాసనసభలో తెలంగాణ తీర్మానం ప్రవేశపెట్టకుండా రోశయ్య హైకమాండ్‌ను ధిక్కరించారని కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యుడు ఆరోపించారు. అంతేకాకుండా జేసీ దివాకర్‌రెడ్డి, డీఎల్‌ రవీంద్రారెడ్డిలకు చెప్పి రాజీనామాలు చేయించారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితికి, 600మంది చావుకు ఆయన కారకులయ్యారని ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమంలో భాగంగా 600 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకోవడానికి ప్రధాన కారణంగా మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్యే కారణమని కాంగ్రెసు తెలంగాణ నేత, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానంపై రోశయ్య చేసిన వ్యాఖ్యల్ని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తప్పుబట్టారు. ఆనాడు ముఖ్యమంత్రి పదవిలో ఉండి కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాన్ని బేఖాతరు చేశారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుతో కుమ్ముకై తెలంగాణపై కుట్రలు పన్నారని ఆరోపించారు.

English summary
Congress Telangana leaders targeted former chief minister K Rosaiah on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X