వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సకల జనుల సమ్మె యథాతథం: కోదండరామ్
5న కరీంనగర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని అన్నారు. సమ్మెకు పట్నం నుంచి పల్లెదాకా అందరూ మద్దతు ప్రకటిస్తారని అన్నారు. వచ్చే నెల 6వ తేది నుండి ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక సంఘాలు పాల్గొంటాయన్నారు. ప్రభుత్వం ఎస్సై పరీక్షలు వాయిదా వేయాలని అన్నారు. విద్యార్థి సంఘాలతో మాట్లాడిన తర్వాత ఎస్సై పరీక్షలపై తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు. ఎవరికీ ఇబ్బందులు కలగని రీతిలో ఉద్యమం ఉంటుందన్నారు. తెలంగాణవ్యాప్తంగా తిరిగి ప్రజలను చైతన్యం చేస్తామని అన్నారు. సమ్మెను విజయవంతం చేయాల్సిన బాధ్యత రాజకీయ నాయకులదే అని బిజెపి సీనియర్ నేత సిహెచ్ విద్యాసాగర రావు అన్నారు. కాంగ్రెసు పార్టీ నేతలు సమ్మెలో పాల్గొనటం అనుమానమే అన్నారు. సమ్మె తర్వాత అసెంబ్లీ ఉండదన్నారు. తెలంగాణ శాసనసభ ఉంటుందన్నారు.
Comments
kodandaram etela rajender sakala janula samme telangana కోదండరామ్ ఈటెల రాజేందర్ సకల జనుల సమ్మె తెలంగాణ
English summary
Telangana political JAC chairman Kodandaram confirms today that Sakala Janula Samme will conitnue.
Story first published: Thursday, August 11, 2011, 16:33 [IST]