నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భర్తపై కక్షతో భార్యపై గ్యాంగ్ రేప్, ఫిర్యాదు చేసిన భర్త

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nellore District
నెల్లూరు: భర్తపై కక్షతో ఆయన భార్యపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బోగోలు మండలం ఎస్వీపాలెంలో ఉంటున్న సుబ్బారావు అనే వ్యక్తి భార్యపై నలుగురు వ్యక్తులు గురువారం రాత్రి సమయంలో అత్యాచారానికి పాల్పడ్డారు. విష్ణు, తిరుమలరావు, దయాకర్, శివ అనే యువకులు ఆ ఘాతుకానికి పాల్పడ్డట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుబ్బారావుపై ఉన్న కోపంతో ఆయనపై దాడి చేసేందుకు రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో వారు వచ్చినట్లుగా వినిపిస్తోంది. ఆ సమయంలో సుబ్బారావు బయటకు వెళ్లడంతో ఆయన భార్య ఒక్కతే ఉండటం చూసిన ఆ దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో స్థానికులు, భర్త ఆమెను కావలి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఆమె పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నట్టు తెలుస్తోంది. యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు పరారీలో ఉన్నారు. ఆమె భర్త సుబ్బారావు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితులు చాలా కాలం క్రితమే ఎస్వీపాలెంకు వలస వచ్చినట్లుగా తెలుస్తోంది.

English summary
Four young make gang rape on married lady yesterday night. Victim's husband Subba Rao complainted in police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X