వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రులనూ వదలొద్దు!: సిబిఐకి శంకర్‌రావు లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shankar Rao
హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, ఎమ్మార్ అక్రమాలపై ఏ ఒక్కరినీ వదలకుండా అందరినీ విచారించాలని చేనేత జౌళీ శాఖ మంత్రి శంకర్ రావు ఆదివారం సిబిఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలోని సంబంధిత మంత్రులను సైతం విచారించాలని ఆయన లేఖలో కోరినట్లుగా తెలుస్తోంది. రిట్ పిటిషనులో లేని వారిని కూడా విచారించాలని సూచించారు. మంత్రులను, అధికారులను, అనధికారులను, సలహాదారులను అందరినీ విచారించాలని సూచించినట్లుగా తెలుస్తోంది.

అందరిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. సాక్షాధారాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున అందరినీ ముందుగానే అదుపులోకి తీసుకోవాలన్నారు. విచారణ నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలన్నారు. సంబంధింత మంత్రులను విచారిస్తే తగిన విషయాలు బయటకు వస్తాయని లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. హైకోర్టు ఆధ్వర్యంలోనే సిబిఐ విచారణ త్వరగా పూర్తి చేసి చర్యలు తీసుకోవాలన్నారు. జగన్ పార్టీ వీడక ముందే తాను హైకోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. ఎమ్మార్ కేసులో ఏ పక్షిని వదలకుండా అన్ని పక్షులను పట్టుకోవాలన్నారు.

English summary
Minister Shankar Rao wrote a letter to CBI director today and suggested on YS Jagan and EMAAR investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X