వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మత్తు మందిచ్చి మహిళా రోగిని రేప్ చేసిన వైద్యుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

New Delhi
న్యూఢిల్లీ: మత్తు మందిచ్చి మహిళా రోగిని రేప్ చేసిన వైద్యుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టుచేశారు. ఢిల్లీలోని నజఫ్‌గర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నిందితుడు దేవరాజ్ వర్మను పోలీసులు అరెస్టు చేశారు. చికిత్స కోసం వెళ్లిన తనకు మత్తు మందిచ్చి తనను వైద్యుడు రేప్ చేశాడని మహిళా రోగి పోలీసులు ఫిర్యాదు చేసింది. రేప్ జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారుట.

తన మరదలుతో కలిసి హర్యానాలోని జజ్జర్ జిల్లాకు చెందిన బాధితురాలు ఉదయం 9 గంటలకు వైద్యుడి వద్దకు వెళ్లింది. పరీక్షించే నెపంతో ఆ మహిళను ఒక్కదాన్నే వైద్యుడు లోనికి పిలిచాడు. ఆ సమయంలో మత్తు మందు సహాయంతో ఆమె స్పృహ కోల్పోయేలా చేసి ఆమెను వైద్యుడు రేప్ చేశాడు.

English summary
A 20-year old woman was allegedly raped by a doctor in the Nazafgarh area of southwest Delhi on Sunday morning. The accused, identified as Devraj Verma, has been arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X