వైయస్ జగన్ కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు
బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి హైకోర్టుకు అందజేయాలని చూస్తున్నట్లుగా సమాచారం. ఎవరి నుండి ఎలాంటి అభ్యంతరాలు రాకుండా ఉండేందుకు పకడ్బందీగా ఎఫ్ఐఆర్ నమోదు ఉండేందుకు కసరత్తు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు అనంతరం రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలలో ఉన్న జగన్ ఆస్తులు, ఎమ్మార్ ఆస్తులపై సిబిఐ అధికారులు మూకుమ్మడి దాడులు చేసే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రత్యేక టీములను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. దిల్ కుష్ అతిథి గృహం నుంచే దర్యాఫ్తు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లుగా సమాచారం.
Comments
ys jagan cbi probe laxmi narayana bangalore hyderabad వైయస్ జగన్ సిబిఐ దర్యాఫ్తు లక్ష్మీ నారాయణ బెంగుళూరు హైదరాబాద్
English summary
It seems, CBI is ready to book case against YSRC party chief YS Jaganmohan Reddy today.
Story first published: Wednesday, August 17, 2011, 13:47 [IST]