కొత్త పార్టీ పెట్టండి: తెలంగాణ టిడిపికి టిఆర్ఎస్ సలహా

తెలంగాణ ప్రాంత మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేయకుండా తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం న్యాయం కోసం జరుగుతున్న ఉద్యమం అన్నారు. న్యాయం కోసం ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎవరి బెదిరింపులకు లొంగేది లేదని కోదండరామ్ అన్నారు. సకల జనుల సమ్మెలో ప్రజలను భాగస్వాములు చేయడానికే బుధవారం నుండి మొదటి దశ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు టిఎన్జీవో నేత స్వామిగౌడ్ చెప్పారు. వచ్చే నెల 6 నుండి సమ్మె ఉధృతం చేస్తామని అన్నారు. కాగా అంతకుముందు సకల జనులసమ్మె ప్రారంభం సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఇందిరాపార్కు వరకు తెలంగాణ జెఏసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.












Click it and Unblock the Notifications