వైయస్ జగన్ ఇంటి వద్ద అభిమానుల నిరసన

జగన్కు రాష్ట్ర ప్రజల నుండి వస్తున్న అపూర్వ ఆదరణ చూసి ఓర్వలేకనే కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలన్నారు. టిడిపి, కాంగ్రెసుతో సహా మిగిలిన ప్రతిపక్షాలు కుమ్మక్కై ఒక్కడిపై కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. జగన్పై ఇలాంటి చర్యలకు పాల్పడితే భవిష్యత్తులో ఏ ఇతర పార్టీకి డిపాజిట్ దక్కదన్నారు. తాము ఎవరికీ నిరసన తెలపడం లేదని జగన్పై అభిమానం మాత్రమే చూపిస్తున్నామని అన్నారు. నిజాయితీ కలిగిన వ్యక్తి కాబట్టే గుండె ధైర్యం కలిగిన వ్యక్తి కాబట్టే తన కంపెనీలపై దాడులు జరుగుతున్నప్పటికీ నిబ్బరంతో ఓదార్పు యాత్ర చేస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications