వైయస్ జగన్ లేకుండా ఇంట్లో సిబిఐ సోదాలా: జూపూడి

వైయస్ జగన్ ప్రజల మధ్య ఓదార్పు యాత్రలో ఉండగా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించడం సరి కాదని ఆయన అన్నారు. జగన్ కాంగ్రెసులో ఉండి ఉంటే రాజాలాగా బతికేవారని ఆయన అన్నారు. తనకు అడ్డొచ్చినవారిని సహించలేని స్థితిలో కాంగ్రెసు ఉందని, అన్నా హజారే గానీ జగన్ గానీ ఎవరైనా సరే కాంగ్రెసు సహించడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి జగన్పై కక్ష తీర్చుకుంటున్నాయని, రాజకీయంగా ఎదుర్కోలేకనే అలా చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ముప్పయి ఏళ్ల పాటు కాంగ్రెసుకు సేవలు చేసిన వైయస్ కుటుంబానికి దీనస్థితిని కల్పిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు గుండాగిరి, దౌర్జన్యం చేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications