సాక్షి విజయసాయి రెడ్డికి ప్రాణహాని: పయ్యావుల

సిబిఐ సోదాలు కీలక సాక్ష్యాలను బయటకు తీసుకు రావడానికే అన్నారు. కోర్టు జోక్యం చేసుకున్న కారణంగా నిజాలు బయటకు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు పార్టీ జాతీయ నాయకుడు అహ్మద్ పటేల్ను కూడా విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. వైయస్ఆర్ మంత్రివర్గంలోని మంత్రులందరినీ విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. వైయస్ మంత్రివర్గం దొంగల ముఠా అన్న ప్రతిపక్షాల ఆరోపణలను జగన్ ఇప్పుడు అంగీకరిస్తున్నారని ఆయన అన్నారు. జగన్ టాటా, బిర్లాల్లా కష్టపడి సంపాదిస్తే సంతోషించే వాళ్లమని కానీ ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా సంపాదించారని అన్నారు.












Click it and Unblock the Notifications