ఎమ్మార్ కేసు, అంబటి రాంబాబూ ఇరుక్కుంటారా?

Ambati Rambabu
హైదరాబాద్: ఎపిఐఐసి - ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో సిబిఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేకపోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఎపిఐఐసి) మాజీ చైర్మన్ అంబటి రాంబాబు సంతోషించే ఉంటారు. అయితే, ఆయన ఈ కేసులో ఇరుక్కునే పరిస్థితులే ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఆయన చైర్మన్‌గా ఉన్నప్పుడే ఐపిఐఐసి, ఎమ్మార్ మధ్య ఒప్పందం కుదరడం ఒకటి కాగా, ఆయన సోదరుడు అంబటి మురళీ కృష్ణ కారు చౌకగా ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఓ విల్లాను కొనుగోలు చేశాడు.

ఎమ్మార్ నివేదిక ప్రకారం - మురళీకృష్ణ చదరవు గజానికి కేవలం ఐదు వేల రూపాయలచొప్పున 1,113 చదరపు గజాల స్థలం పొందాడు. నిజానికి దాని మార్కెట్ విలువ చదరపు గజానికి 40 వేల రూపాయలకు పైగానే ఉంటుంది. అయితే ఈ విషయం తనకేమీ తెలియదని అంబటి రాంబాబు అంటున్నట్లు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రాసింది. ఆ ఒప్పందం 2009 మార్చి 30వ తేదీననే జరిగిందని ఆయన చెబుతున్నారట. చాలా మంది పెద్దలు ఎమ్మార్‌లో చౌక ధరలకు స్థలాలు పొందినట్లు ఆరోపణలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+