అప్పుడు వైయస్కు రామోజీరావు ఈనాడు మద్దతు!: బాబు
భారతీయ జనతా పార్టీ నిస్సిగ్గుకా జగన్కు మద్దతు పలుకుతోందని ధ్వజమెత్తారు. జగన్కు అడుగడుగునా బరితెగించి మద్దతు పలుకుతోందన్నారు. అవినీతిపరులకు మద్దతు పలుకుతున్నందునే బిజెపి ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన్నారు. అవినీతికి ఎవరూ వ్యతిరేకంగా పోరాటం చేసినా టిడిపి మద్దతిస్తుందన్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి అన్నాహజారే నాంది పలికారన్నారు. అన్నా దీక్షతో పాక్షిక విజయం సాధించామని దీనిని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. అన్నా దీక్షపై కేంద్ర ప్రభుత్వం దిగి రావడం ప్రజల విజయం అన్నారు. అవినీతి వల్ల రాజకీయాలు అంటే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్నారు. కోర్టులు, లోకాయుక్తలపై ప్రజలకు విశ్వాసం కలుగుతోందన్నారు.
బిజెపి, కాంగ్రెసు పార్టీలు కలిసి అన్నా దీక్షను నీరుగార్చే ప్రయత్నాలు చేశాయని ఆరోపించారు. అందుకే అవి ప్రజల్లో విశ్వాసం కోల్పోయాయన్నారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించే పరిస్థితి లేదన్నారు. రాజకీయలపై విద్యార్థులకు సదుద్దేశ్యం లేదన్నారు. రాజకీయ వ్యవహారాలపై ఎన్నికల సంఘం సైతం నామమాత్రంగా వ్యవహరిస్తోందన్నారు. అసెంబ్లీ దగ్గర మీడియా పాయింటు ఎత్తేయడం సరికాదన్నారు.