వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముసుగు దొంగలు: జగన్ వర్గం ఎమ్మెల్యేలపై బొత్స
సీబీఐ దాడులకు నిరసనగా జగన్వర్గ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోపక్క ప్రభుత్వానికి కూలగొట్టడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల నుంచి రూ.15 కోట్లు ఎరగా చూపిస్తూ ఫోన్లు చేస్తున్నారంటే ఎంత నీచస్థాయికి దిగజారుతున్నారో ఊహించుకోవచ్చని ఆయన ఆరోపించారు. ఇంకా రాష్ట్రాన్ని దోచుకుంటాం, అవినీతికి లైసెన్స్ ఇవ్వండన్నట్టుగా వైయస్సార్ కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. బ్లాక్మెయిలింగ్కు పాల్పడే ముసుగు దొంగల్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరని బొత్స అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకలాపాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమించాయన్నారు.
Comments
botsa satyanarayana pcc president east godavari ys jagan Kakinada పిసిసి అధ్యక్షుడు తూర్పు గోదావరి వైయస్ జగన్ కాకినాడ
English summary
PCC President Botsa Satyanarayana attacked YS Jagan and his camp MLAs.
Story first published: Monday, August 29, 2011, 7:55 [IST]