వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పై దూకుడు పెంచిన బొత్స సత్యనారాయణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
కాకినాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మరింతగా దూకుడు పెంచారు. ఆయన సోమవారం రెండో రోజు కూడా తూర్పు గోదావరి జిల్లాలో తన పర్యటన కొనసాగిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. డబ్బు మదంతో, అధికార దాహంతో వైయస్ జగన్ వర్గం ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.

సిబిఐ అత్యున్నత విచారణ సంస్థ అని వైయస్ జగన్ అన్నారని, అవినీతికి పాల్పడకపోతే వైయస్ జగన్ సిబిఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ఆయన అన్నారు. దమ్ముంటే వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలని ఆయన సవాల్ చేశారు. రాజీనామాలు చేసిన శానససభ్యులు వైయస్ జగన్ చుట్టు మాత్రమే చూస్తున్నారని, ప్రజలు ఏమనుకుంటున్నారో ఆలోచించడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. వైయస్ జగన్ వర్గం శాసనసభ్యుల రాజీనామాల ఆమోదం రెండు నిమిషాల పని ఆయన అన్నారు.

మోహన్ కందా కమిటీ నివేదిక సిఫార్సుల మేరకు ప్రభుత్వం క్రాప్ హాలిడేపై నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని, ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.

English summary
PCC President Botsa Satyanarayana continued his attack against YSR Congress president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X