బిజెపితో జగన్ దోస్తీ ఖరారు, ఓదార్పు మాటలతో వెల్లడి
కాగా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై జగన్ నిప్పులు చెరిగారు. రాజకీయ లబ్ధి కోసం మామనే వెన్నుపోటు పొడిచారని ఆయన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఒక అబద్ధాన్ని చెప్పీ చెప్పీ దాన్ని నిజమని నమ్మించగల నేర్పరి అని ఆయన చంద్రబాబును ఎత్తిపొడిచారు. రెండెకరాలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చి వేల కోట్ల రూపాయలు సపాందించారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు చేస్తే అభివృద్ధి, ఇతరులు చేస్తే అవినీతా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీపైనా ఆయన విమర్శలు చేశారు. రెండు సార్లు కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తెచ్చిన వైయస్సార్ను కాంగ్రెసు నేతలు అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్సించారు.
ys jagan ysr congress odarpu yatra krishna district bjp vijayawada వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు ఓదార్పు యాత్ర కృష్ణా జిల్లా విజయవాడ
English summary
It seems that YSR Congress president YS Jagan has prepared to go with BJP at National level.
Story first published: Monday, August 29, 2011, 8:26 [IST]